11, డిసెంబర్ 2019, బుధవారం
9, నవంబర్ 2018, శుక్రవారం
అనుమతులు రద్దు చేయండి
పరవాడ, చైతన్యవారధి: మండలంలో భరణికం పంచాయితీ పరిధిలో నిర్మిస్తున్న అమ్మోనియా గ్యాస్ కంపెనీ కి అనుమతులు రద్దు చేయమని ప్రత్యేక అధికారికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో అమ్మోనియా గ్యాస్ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అమ్మోనియం గ్యాస్ కంపెనీ నుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది.
27, జులై 2018, శుక్రవారం
పవన్ కు ఎవరినీ మోసగించటం చేతకాదు

- జగన్ వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్
పవన్ కు ఎవరినీ మోసగించటం చేతకాదని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు అన్నారు. పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైవాహిక జీవితంలోనూ పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. ఇద్దరు భార్యల నుంచి విడాకులు తీసుకోవటానికి కారణాలు ఏమిటన్నది భార్యభర్తల మధ్య జరిగిన విషయమని.. పవన్ చట్టబద్ధంగానే విడాకులు తీసుకున్నారని.. అందులో ఎలాంటి వివాదం లేదన్నారు. పవన్ మొదటి భార్య కానీ.. రెండో భార్య రేణూ కానీ ఎక్కడా పవన్ గురించి తప్పుగా మాట్లాడిన సందర్భాలు లేవని నాగబాబు చెప్పారు.
17, ఏప్రిల్ 2018, మంగళవారం
వైభవంగా జిల్లా ప్రజా పరిషత్ శతవసంతాల వేడుకలు
తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ శతవసంతాల వేడుకలు వైభవంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ శత వసంతాల వేడుకల సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్ శత జయంతి వేడుకల జెండాను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ , జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు.
నిజరూప దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
- సామాన్య భక్తులకు సకల సౌకర్యాలు
మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, ఏప్రిల్ 17(చైతన్యవారధి): స్వామి నిజరూప దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులందరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని రాష్ట్ర మానవవనరుల శాఖా మాత్యులు గంటా శ్రీనివాసరావు వివరించారు. మంగళవారం మంత్రి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు రామచంద్ర మోహన్ తో కలిసి గుడి ప్రాంగణం అంతా తిరిగి పరిశీలించి ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, ఏప్రిల్ 17(చైతన్యవారధి): స్వామి నిజరూప దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులందరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని రాష్ట్ర మానవవనరుల శాఖా మాత్యులు గంటా శ్రీనివాసరావు వివరించారు. మంగళవారం మంత్రి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు రామచంద్ర మోహన్ తో కలిసి గుడి ప్రాంగణం అంతా తిరిగి పరిశీలించి ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేశారు.
మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇవిఎమ్ ల పరిశీలన
- ఆర్.డి.వో ఎల్.రఘుబాబు వెల్లడి
కాకినాడ, ఎప్రిల్ 17(చైతన్యవారధి):
రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఉత్తర్వులు ప్రకారముప్రకారము తూర్పుగోదావరి జిల్లా కలక్టరు వారి కార్యాలయము ప్రక్కన గల ఎన్నికల గోదామునందు భద్రపరచిన ఇవిఎమ్ లను నూరు శాతము మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశీలన చేయుటకు ఈ రోజు ఉదయము కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు అద్వర్యములో రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షములో ఎన్నికల గోదామును తెరిచి ఇవిఎమ్ లను నూరు శాతము మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశీలన చేయు కార్యక్రమము ప్రారంభించడమైనది. ఈ యొక్క పరిశీలన కార్యక్రమము ఈ రోజు నుండి ఈ నెల 25 వ తేదీ వరకు జరుగు ఇవిఎమ్ లు పరిశీలన జరుగునని ఆర్.డి.వో ఎల్.రఘుబాబు తెలిపియున్నారు. అదే విధముగా ప్రస్తుత ఎన్నికల గోదామునందు మొదటి అంతస్తు నిర్మాణములో ఉన్న అదనపు గోదాము నిర్మాణము పనులు పరిశీలించి గోదాము నిర్మాణ పనులు వేగవంతము చేయాలని సదరు గోదాము నిర్మాణ గుత్తేదారును ఆదేశించియున్నారు. ఈ యొక్క పరిశీలన కార్యక్రమములో కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు తో పాటు భారత జనతా పార్టీ జిల్లా పార్టీ అద్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, సి.పి.ఐ. పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్.కిషోర్, కాకినాడ అర్బన్ తహశీల్దార్ జి.బాలసుబ్రహ్మణ్యం, తహశీల్దార్ కె.ఆర్.సి ఎం.విద్యాసాగర్, ఎన్నికల డిప్యూటి తహశీల్దార్ జె.వి.ఆర్.రమేష్, కె.యస్.వి.సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ సహయ ఇంజీనీరు సుబ్బరాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ, ఎప్రిల్ 17(చైతన్యవారధి):
రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఉత్తర్వులు ప్రకారముప్రకారము తూర్పుగోదావరి జిల్లా కలక్టరు వారి కార్యాలయము ప్రక్కన గల ఎన్నికల గోదామునందు భద్రపరచిన ఇవిఎమ్ లను నూరు శాతము మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశీలన చేయుటకు ఈ రోజు ఉదయము కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు అద్వర్యములో రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షములో ఎన్నికల గోదామును తెరిచి ఇవిఎమ్ లను నూరు శాతము మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశీలన చేయు కార్యక్రమము ప్రారంభించడమైనది. ఈ యొక్క పరిశీలన కార్యక్రమము ఈ రోజు నుండి ఈ నెల 25 వ తేదీ వరకు జరుగు ఇవిఎమ్ లు పరిశీలన జరుగునని ఆర్.డి.వో ఎల్.రఘుబాబు తెలిపియున్నారు. అదే విధముగా ప్రస్తుత ఎన్నికల గోదామునందు మొదటి అంతస్తు నిర్మాణములో ఉన్న అదనపు గోదాము నిర్మాణము పనులు పరిశీలించి గోదాము నిర్మాణ పనులు వేగవంతము చేయాలని సదరు గోదాము నిర్మాణ గుత్తేదారును ఆదేశించియున్నారు. ఈ యొక్క పరిశీలన కార్యక్రమములో కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు తో పాటు భారత జనతా పార్టీ జిల్లా పార్టీ అద్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, సి.పి.ఐ. పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్.కిషోర్, కాకినాడ అర్బన్ తహశీల్దార్ జి.బాలసుబ్రహ్మణ్యం, తహశీల్దార్ కె.ఆర్.సి ఎం.విద్యాసాగర్, ఎన్నికల డిప్యూటి తహశీల్దార్ జె.వి.ఆర్.రమేష్, కె.యస్.వి.సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ సహయ ఇంజీనీరు సుబ్బరాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్ధులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
గాజువాక, ఏప్రిల్, 17(చైతన్యవారధి): జీవీఎంసీ ౫౦వ వార్డు పరిధిలో గల సంజీవిగిరి కాలనీలో గల విజ్ణాన్ స్కూల్ లో ఎమ్ సెట్, పాలిటెక్నిక్ విద్యార్దులకు స్టడీ మెటీరియల్ ను అందజేశారు. జాన్సీ ఎడ్యుకేషనల్ సోసైటీ సహకారంతో ఈ మెటీరియల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రధర్ రావు, తెదేపా విశాఖ అర్బన్ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ ముఖ్య అథితులుగా పాల్గొని విద్యార్ధులకు అందజేశారు. సుమారు 2౦౦ మంది విద్యార్ధులకు ఈ మెటీరియల్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజ్ణాన్ స్కూల్ డైరెక్టర్ డి.వి.రమణీ, జాన్సీ ఎడ్యుకేషనల్ ట్రస్టు వ్యవస్ధాపకులు వానపల్లి శ్రీనివాసరావు, ఎం.ఎస్.కుమార్, సి.హెచ్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
15, డిసెంబర్ 2017, శుక్రవారం
నోవర్క్ ఆర్గానిక్స్ నుంచి సేంద్రియ ఎరువులు, పశు పోషక ఉత్పత్తులు
విశాఖపట్నం, చైతన్యవారధి: పూణేకు చెందిన నోవర్క్ ఆర్గానిక్స్ సంస్థ సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులు, పశుపోషక ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్థానిక హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఉత్పత్తుల వివరాలు వివరించారు. నేలలో తేమను నిలిపేందుకు ప్రత్యేక మైన ఒక ఉత్పత్తిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నోవర్క్ సంస్థ జీఎం సుభీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ తమ సంస్థ ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, హాని కరం కాని పశు పోషణ ఉత్పత్తులు ఉపయోగించటం వల్ల మెరుగైన ఫలితాలు సాధించ వచ్చునన్నారు. ఎటువంటి రసాయనాలు లేని సహజ సిద్ధంగా లభించే మొక్కల నుంచి ఈ ఉత్పత్తులు తయారు చేయడం జరిగిందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ఖర్చుకు అందిస్తున్నామన్నారు.
రీజినల్ సేల్స్ మేనేజర్ ఇందుకూరి రవి మాట్లాడుతూ నోవర్క్ ఉత్పత్తులు హెర్భల్స్ తో తయారు చేయడం తో భూమి మరింత సారవంతమవుతుందన్నారు. తద్వారా పంట పెరుగు దల ఆశాజనకంగా ఉంటుందన్నారు. ఏపీ ఫ్రాంచేజీ టీవిఎస్ ఎన్ రాజు మాట్లాడుతూ నోవర్క్ ఉత్పత్తులు రాష్ట్రంలోనే పూల రైతుల ఇంట తలుపులు తట్టనున్నాయన్నారు. ఉత్పత్తుల ద్వారా కేవలం వ్యవసాయ, పశుపోషణ ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడమే కాక ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించవచ్చన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. నోవర్క్ సంస్థ నేషనల్ మీడియా మేనేజర్ ఆశాలత నాయక్ మాట్లాడుతూ ఏపీలో ప్రతి గ్రామానికి తమ ఉత్పత్తులు చేరువ చేయాలన్నదే ముఖ్య లక్ష్య మన్నారు.
రీజినల్ సేల్స్ మేనేజర్ ఇందుకూరి రవి మాట్లాడుతూ నోవర్క్ ఉత్పత్తులు హెర్భల్స్ తో తయారు చేయడం తో భూమి మరింత సారవంతమవుతుందన్నారు. తద్వారా పంట పెరుగు దల ఆశాజనకంగా ఉంటుందన్నారు. ఏపీ ఫ్రాంచేజీ టీవిఎస్ ఎన్ రాజు మాట్లాడుతూ నోవర్క్ ఉత్పత్తులు రాష్ట్రంలోనే పూల రైతుల ఇంట తలుపులు తట్టనున్నాయన్నారు. ఉత్పత్తుల ద్వారా కేవలం వ్యవసాయ, పశుపోషణ ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడమే కాక ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించవచ్చన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. నోవర్క్ సంస్థ నేషనల్ మీడియా మేనేజర్ ఆశాలత నాయక్ మాట్లాడుతూ ఏపీలో ప్రతి గ్రామానికి తమ ఉత్పత్తులు చేరువ చేయాలన్నదే ముఖ్య లక్ష్య మన్నారు.
18, జులై 2017, మంగళవారం
పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ
పరవాడ, చైతన్య వారధి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా ర్ధినీలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చుక్క రామునాయుడు,
పరవాడ 1 ఎంపీటీసీ పైల శ్రీనివాసరావు, పరవాడ 2 ఎంపీటీసీ సిరపురపు అప్పల నాయుడు, పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ పైల హరీష్, పైల రమణబాబు, పోతల అప్పల నాయుడు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పరవాడ 1 ఎంపీటీసీ పైల శ్రీనివాసరావు, పరవాడ 2 ఎంపీటీసీ సిరపురపు అప్పల నాయుడు, పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ పైల హరీష్, పైల రమణబాబు, పోతల అప్పల నాయుడు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
అజికో ఫార్మా కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ
పరవాడ, చైతన్యవారధి: జవహార్ లాల్ ఫార్మాసిటీలో గల అజీకో ఫార్మా కంపెనీ లో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహార చెక్కులను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ముర్తి అందజేశారు. మంగళవారం స్ధానిక జిల్లా పరిషత్ అథితి గృహంలో నిర్వహించిన కార్యక్రమం లో ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం లో అజీకో ఫార్మా కంపెనీ ప్రతినిధులు, మండలాధ్యక్షుడు మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు పైల జగన్నాథరావు, మాజీ మండలాధ్యక్షుడు మాదంశెట్టి నీలబాబు, నాయకులు చింతకాయల ముత్యాలు, బొడ్డపల్లి అప్పారావు, బుగిడి రామగోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)