9, అక్టోబర్ 2010, శనివారం
గ్రామీణుల నేస్తం తపాలాశాఖ
హైదరాబాద్: గ్రామీణప్రాంతాలకు పూర్తిస్థాయిలో సేవలందించేది ఒక్క తపాలాశాఖేనని గ్రామీణులకు అది నిజమైన నేస్తమని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా జూబ్లీహాలులో జరిగిన జాతీయ పోస్టల్ వీక్ ఉత్సవాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా తపాలా జీవితబీమా, గ్రామీణ జీవితబీమా, ప్రాజెక్ట్ యూరో పథకాల్లో అత్యత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు మొమెంటోలు అందించారు. ప్రే, ఆప్యాయతలను ప్రజలవద్దకు తీసుకువెళ్లేవారే పోస్ట్మ్యాన్లని గవర్నర్ ప్రశంసించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి