నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఫారెస్ట్ రేంజర్ రవీందర్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడులు జరిపారు. వారి సోదాల్లో రూ.కోటికి పైగా అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. రవీందర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి