కోల్కత: దేశ అభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగానిదే కీలకపాత్ర అని ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. భారత వందో వైజ్ఞానిక సదస్సు ఈరోజు కోల్కతలో ప్రారంభమైంది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధాని ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విధానాన్ని ప్రకటించారు. 2020 నాటికి ఐదు ప్రపంచ వైజ్ఞానిక శక్తుల్లో ఒకటిగా
భారత్ను నిలపాలన్నదే లక్ష్యమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగానిది కీలకపాత్ర అని, ధనికులు, పేదల మధ్య అంతరాన్ని తొలగించేందుకు శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి తోడ్పడుతుందని అన్నారు. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాల్సిన అవసరముందని ప్రధాని పేర్కొన్నారు.
భారత్ను నిలపాలన్నదే లక్ష్యమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగానిది కీలకపాత్ర అని, ధనికులు, పేదల మధ్య అంతరాన్ని తొలగించేందుకు శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి తోడ్పడుతుందని అన్నారు. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాల్సిన అవసరముందని ప్రధాని పేర్కొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి